కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే జిల్లాలో అభివృద్ధి ఉండదు
– బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
జై తెలంగాణ న్యూస్ ( కల్లూరు )
హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే జిల్లాలో అభివృద్ధి ఉండదని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. కల్లూరులోని బీఆర్ఎస్ నాయకుడు బొప్పెన రామారావు గృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. తన గెలుపుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలన్నారు. కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.