బస్సులో మహిళ జారీ బస్సు టైరు క్రింద పడి మృతి
జిల్లాలో తీవ్ర బస్సుల కోరత
జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పట్టించుకోని వైనం
జై తెలంగాణ న్యూస్ – ఖమ్మం
ఖమ్మం జిల్లాలో తీవ్ర బస్సుల కోరత ఉంది.ప్రయాణీకులు పెరిగినా బస్సుల సాంఖ్య పెంచటం లేదు.జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాలో బస్సుల సంఖ్య పెరిగిన ప్రయాణీకులకు అనుగుణంగా బస్సులు సమకుర్చే విషయంలో పట్టించుకొవటం లేదు. ఈరోజు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో బస్సులో నుండి జారిపడి బస్సు వెనుక టైర్ కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.మృతురాలు కొణిజర్ల మండలం పెద్దమనగాల గ్రామానికి చెందిన అనూష అనే మహిళగా గుర్తింపు.
ఉచిత బస్సు పేరుతో ఏంతో మహిళలు ప్రయాణంలో ప్రమాధాల బారిన పడుతున్నారు.మొన్న నేలకొండపల్లిలో ఓ మహిళ పడి గాయాలతో బయటపడింది.ఈరోజు మహిళా ఏకంగా మృతి చెందారు.ప్రభుత్వం మంత్రులు స్పందించాలి.