ఆదిలాబాద్: ఆగస్టు 9 న ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన్ దండోరా ప్రారంభానికి కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీన్ని కొన్ని ఆదివాసీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి. ఆదివాసీ దినోత్సవాలను రాజకీయంగా హైజాక్ చేయడానికి చేసిన ప్రయత్నంగా విమర్శలు మొదలయ్యాయి.
“ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటారు మరియు ఇది ఆదివాసులకు పండుగ లాంటిది. అదే రోజు రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆ రోజును హైజాక్ చేస్తోంది మరియు మేము దానిని వ్యతిరేకిస్తున్నాము “అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ యూనిట్ అధ్యక్షుడు గోడం గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆదివాసులు తమ ఆచార సంప్రదాయాల ప్రకారం ఆగష్టు 9న వేడుక జరుపుకుంటారు. కాని అదే రోజు కాంగ్రెస్ కావాలనే కార్యక్రమాన్ని ఆదివాసులతో నిర్వహించడం వెనుక కేవలం రాజకీయ స్వలాభం తప్పితే మరొకటి కాదనే విషయాన్ని ఆదివాసులు గుర్తిస్తారు. మరో రకంగా ఇది ఆదివాసీలను అవమానించడమే అవుతుందని, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆదివాసులు మరియు లంబాడాలు తమ హక్కులు మరియు భూముల కోసం కలిసి పోరాడారనే TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాదనతో గోడం గణేష్ విభేదించాడు. “ఇది పూర్తిగా తప్పు మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు తన వాస్తవాలను సరిదిద్దుకోవాలి” అని ఆయన వాదించారు.ఆదివాసీలతో పాటు లంబాడాలు
ఎటువంటి ఆందోళనల్లోనూ
పాల్గొనలేదు. గిరిజన నాయకులు కుమ్రం భీమ్ హక్కులు మరియు భూముల కోసం పోరాడారు. ఇంద్రవల్లిలో తమ ప్రాణాలను అర్పించిన ఘనత వారికే దక్కతుందని, ఇందులో ఎవరి గొప్పతనం లేదని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించాడు.