టిప్ప‌ర్ లారీని ఢీకొన్న కారు- న‌లుగురు మృతి

పెద్దాపురం, (ADITYA9NEWS) : తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డులో టిప్ప‌ర్ లారీని కారు ఢీకొన్న ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. తాళ్ల‌రేవు మండ‌లం పెద్ద వ‌ల‌స‌కు చెందిన 9 మంది స‌భ్యులు కారులో రాజ‌మండ్రి గృహా ప్ర‌వేశానికి గురువారం తెల్ల‌వారు జామున బ‌య‌లు దేరారు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ఎదురుగా వ‌స్తున్న టిప్ప‌ర్ లారీని బ‌లంగా ఢీకొట్టింది.

ఈఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న 9 మందిలో న‌లుగురు స్పాట్‌లో మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. కారు నుజ్జ‌వడంతో ఇరుక్కుపోయిన వారిని బ‌య‌ట‌కు తీసేందుకు పోలీసు శ్ర‌మించారు. మృత‌దేహాలను పెద్దాపురం మార్చురికి పంపించారు. గాయ‌ప‌డ్డ మిగిలిన ఐదుగురిని కాకినాడ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. పెద్దాపురం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :