తూర్పుగోదావ‌రిలో లాక్ డౌన్

 
పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా జిల్లాలో ఈనెల 25 నుండి లాక్ డౌన్‌ను
విధిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డి. ముర‌ళీధ‌ర‌రెడ్డి తెలిపారు.
ఈమేర‌కు నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేశారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కూ
లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు

* ఈనెల 25 నుండి ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ప్ర‌జ‌లు
బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అనుమ‌తి
* దేవాల‌యాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి కూడా కేవ‌లం 6 నుండి
11 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే తెర‌వాలి
* ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాల‌కు యధావిధిగా ప‌నిచేసుకోవ‌చ్చు.
* పాఠ‌శాల‌లు, కోచింగ్ సెంట‌ర్లు, క‌ళాశాల‌లు మూసివేయాలి
* రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో ఉద‌యం 11 గంటల వ‌ర‌కూ మాత్ర‌మే పార్సిల్స్‌కు అనుమ‌తి
*  జిల్లా నుండి ఇత‌ర జిల్లాల‌కు ఎటువంటి ర‌వాణా సౌక‌ర్యం లేదు.(మెడిక‌ల్
మిన‌హాయించి)
* లిక్క‌ర్‌, పాన్‌, గుట్కా ల‌కు ప‌బ్లిక్ స్థ‌లాల‌లో అనుమ‌తి లేదు.
* ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే లిక్క‌ర్ దుకాణాల‌కు అనుమ‌తి
* ఉద‌యం 11 త‌రువాత బ‌య‌ట‌కు వ‌స్తే కేసులు న‌మోదు చేస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :