ఆమెకు.. 14మందితో అక్రమ సంబంధం. నిఘాతో బట్టబయలు చేసిన భర్త. ………………………………..
డబ్బు, నౌకర్లు, భర్త అమితమైన ప్రేమ… ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ఈ క్రమంలోనే… ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా పధ్నాలుగు మందితో ‘సంబంధం’ నడిపింది. అయితే… ఒక సందర్భంలో… భర్తకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో… విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.
కోల్కతాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అతను భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా… ఆమె మాత్రం సఖ్యతగా ఉండేది కాదు. ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడం, బయటకు వెళ్లడం చేస్తుండేది. ఈ క్రమంలో… భర్తకు అనుమానం తలెత్తింది. వెంటనే… ఓ ప్రైవేటు డిటెక్టీవ్ను ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. ఈ క్రమంలో… ఆమె కదలికలను పూర్తిగా అధ్యయనం చేసిన డిటెక్టీవ్… విస్తుపోయే నిజాలను భర్తకందించాడు. ఇక విషయమేమిటంటే… ఆయన భార్య… ఒకరికి తెలియకుండా మరొకరితో, అలా మొత్తం పధ్నాలుగు మంది బాయ్ఫ్రెండ్స్తో ‘సంబంధం’ నెరపుతోందని తేల్చాడు. ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే… తన భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందంటూ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అయితే… కేవలం భార్యకే కాకుండా ఆ పధ్నాలుగు మంది బాయ్ఫ్రెండ్స్కు కూడా నోటీసులు పంపాడు. తనకు పరువు నష్టం కింద… రూ. 100 కోట్లను చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.
దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమె బాయ్ఫ్రెండ్స్ తలలు పట్టుకున్నారు. మొత్తంమీద కోల్కతాలో ఈ విషయం చర్చనీయాంశమైంది.